Thursday, 5 September 2013

Nidurinche Thotaloki song lyrics from Muthyala Muggu Telugu Movie


            Lyricist : Gunturu Seshendra sharma
            Singers : P.Susheela

Nidurinche thotaloki paata okati vachindi
kannullo neeru tudichi kammati kala vachindi
nidurinche totaloki paata okati vachindi
kannullo neeru tudichi kammati kala vachindi

ramyamgaa kuteerana rangavalluladdindi
deenurali gutilona deepamga veligindi
ramyamgaa kuteerana rangavalluladdindi
deenurali gutilona deepamga veligindi
shunyamaina venuvulo oka swaram kalipi nilipindi
shunyamaina venuvulo oka swaram kalipi nilipindi
aakuraalu adaviki oka aamani daya chesindi

viphalamaina na korkelu velade gummamlo
aashala adugulu vinabadi antalo poyayi
viphalamaina na korkelu velade gummamlo
aashala adugulu vinabadi antalo poyayi
kommallo pakshullaraa gaganamlo mabbullaraa
nadi dochukupotunna navanu aapandi
revu bavurumantondani naavaku cheppandi

2 comments:

  1. - https://www.youtube.com/watch?v=fgmx0Q887RI

    నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
    కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది
    నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
    కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

    రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
    దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
    రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
    దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
    శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
    శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
    ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది
    నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
    కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

    విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
    ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
    విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
    ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
    కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
    నది దోచుకుపోతున్న నావను ఆపండి
    రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
    నావకు చెప్పండి...
    నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
    కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

    చిత్రం : ముత్యాలముగ్గు
    రచన : గుంటూరు శేషేంద్ర శర్మ
    గానం : పి.సుశీల
    సంగీతం : కె.వి.మహదేవన్ : 1975
    -----------
    గుంటూరు శేషేంద శర్మ

    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........
    - ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
    (21 ఆగస్టు, 2000)
    * * *
    పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు.
    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
    గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
    నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
    కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు.
    ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
    సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు,
    వచన కవిత్వం, పద్యరచన - రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
    వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
    బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
    ఒకానొక శైలీ నిర్మాత.
    - యువ నుంచి యువ దాకా (కవితాసంకలనం)
    అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999
    Seshendra : Visionary Poet of the Millennium
    seshendrasharma.weebly.com

    ReplyDelete
  2. సహస్రాబ్ది దార్శనిక కవి
    కవిర్విశ్వో మహాతేజా
    గుంటూరు శేషేంద్ర శర్మ
    Visionary Poet of the Millennium
    http://seshendrasharma.weebly.com/

    జననం 1927 అక్టోబరు 20నాగరాజపాడు, నెల్లూరుజిల్లా

    మరణం 2007 మే 30 (వయసు 79)హైదరాబాదు

    తండ్రి సుబ్రహ్మణ్య శర్మ
    తల్లి అమ్మాయమ్మ
    భార్య / జానకి
    పిల్లలు వసుంధర; రేవతి (కూతుర్లు); వనమాలి; సాత్యకి (కొడుకులు)

    కవి విమర్శకుడు
    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు .
    – ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
    (21 ఆగస్టు, 2000)
    “ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు.
    - పుస్తకం.నెట్

    * * *
    పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
    కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
    గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
    నాదేశం – నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
    కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
    ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
    సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
    వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
    ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
    వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
    బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
    ఒకానొకశైలీనిర్మాత.

    – యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
    అ.జో. – వి. భొ. ప్రచురణలు 1999
    -----------
    ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి
    శిఖరముల నిల్చి ఇరువు రర్చింపబడెడి _
    ఏడు కొండలన్ " శ్రీవేంకటేశు " డొకడు !
    సాహితీ గిరిన్ " శేషేంద్ర శర్మ " యొకడు !!
    - డా.ఆచార్య ఫణీంద్ర
    -------------
    కత్తులుగా మొలిచిన శేషేంద్ర మాటలు మానవత్వం పరిమళించే తోటలై,
    యువశక్తిని నవయుగం వైపుకు నడిపించే బాటలై,
    సారస్వత విలువలను సంరక్షించే దుర్భేద్యమైన కోటలై
    ఈ శతాబ్ది చైతన్య స్రవంతిలో అంతర్లీనమయ్యాయి.
    ఇదీ శేషేంద్ర సంకల్పం.
    ఇదీ శేషేంద్ర స్వామ్యవాద సాహిత్య శిల్పం………
    * * *
    అక్టోబర్ తర్వాత విప్లవంతో పెనవేసుకున్న
    మరో నెల మే . అదే మే డే !
    కాకతాళీయంగా శేషేంద్ర నిర్యాణం మే నెలలోనే.
    అలా జనన మరణాలను అనూహ్యంగా
    విప్లవంతో అనుసంధానం చేసుకున్న కాలజ్ఞులు శేషేంద్ర..
    - -- డా.వెనిగళ్ళ రాంబాబు
    - సినీ గీత రచయిత
    -
    -
    Visionary Poet of the Millennium
    seshendrasharma.weebly.com

    ReplyDelete